SRPT: అనంతగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఇవ్వాళ ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సలీమా మాట్లాడుతూ.. విద్యార్థులందరూ వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.