TG: సైఫాబాద్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రేతలు మహ్మద్ గులాం జిలానీ, ఫిరోజ్ బిన్ అలీ సులేమాన్ ఖాన్ల నుంచి 100 గ్రాముల బ్రౌన్ షుగర్, 1350 గ్రాముల డ్రై గంజాయి, 7 సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.23.50 లక్షలు ఉంటుందని, జిలానీ ఒడిశా నుంచి డ్రగ్స్ తెచ్చి సాహిల్, సులేమాన్కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.