NRPT: జిన్నారం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. పాఠశాల హెచ్ఎంగా ప్రణితి, ఎంఈఓగా రియాజ్ లతోపాటు 30 మంది ఉపాధ్యాయుల వ్యవహరించినట్లు పాఠశాల హెచ్ఎం శ్రీవాణి తెలిపారు. ఉత్తమ విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు బహుమతులను అందజేసినట్లు తెలిపారు.