NRPT: నారాయణపేట పట్టణ శివారు యాదగిరి రోడ్డులో సోమవారం సాయంత్రం ఎక్సైజ్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఉండేందుకు వాహనాలు తనిఖీలు చేపట్టినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. మత్తు పదార్థాలు, గంజాయి, కర్ణాటక మద్యం రాష్ట్రంలోకి రాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నా, సేవిస్తున్నా సమాచారం ఇవ్వాలన్నారు.