ADB: ఆదిలాబాద్ పట్టణానికి నీటిని అందించే లాండసాంగి పంప్ హౌస్ వద్ద 500KV ట్రాన్స్ ఫార్మర్లో సాంకేతిక సమస్య తలెత్తిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. మరమ్మతుల నిమిత్తం దానిని పంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో పట్టణంలో మంచినీటి సరఫరా ఉండదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కమిషనర్ కోరారు.