KMM: ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ సహా మొత్తం 43 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితులకు మద్దతుగా సోమవారం అనుమతి లేకుండా ధర్నా చేపట్టి, వారిని రెచ్చగొట్టారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు.