వికారాబాద్ జిల్లాలో రైతు నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 1,62,534 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 89 శాతం నమోదు పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగతా రైతులు కూడా త్వరగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. నమోదు పూర్తి అయిన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.