AP: మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు చుక్కెదురైంది. పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఏ3, ఏ 4 నిందితులు వంకిరెడ్డి మాధవరెడ్డి, బల్లాపురం మునిరత్నం ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించారు. దర్యాప్తు పురోగతికి తాము అడ్డం రాలేమని ధర్మాసనం పేర్కొంది.
Tags :