BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామపంచాయతీ వద్ద రేపు ఉదయం 10 గంటలకు పలు పథకాలపై ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు BPM నాగేశ్వరి తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా జిల్లా IPPB అధికారులు రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ శిబిరంలో పోస్ట్ ఆఫీస్ పథకాలు, ప్రమాద బీమాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.