SRD: విద్యార్థులు కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఇవాళ ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు.