VZM: మద్యం సేవించి వాహనాలు నడిపిన 107 మందికి జిల్లా కోర్టు రూ.10.70 లక్షల భారీ జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఫైన్ పడిందని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పేర్కొన్నారు.