PDPL సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మార్కండేయ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులను, 7,8 వార్డుల కౌన్సిలర్లు ఊట్ల వరప్రదీప్, చింతల రాజు పరిశీలించారు. రూ.కోటి నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలని, అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న డీఈ, ఏఈలను కోరారు. త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.