JGL: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ధర్మపురి క్షేత్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. గోదావరి తీరంలోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా ఉండడంతో పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఘాట్ల అభివృద్ది, రహదారుల విస్తరణ చేయాలన్నారు.