NRML: కుబీర్ గ్రామ పంచాయతీ ఈవోగా మాధవ్ నియమితులయ్యారు. బదిలీపై వచ్చిన ఆయన ఇవాళ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు మరింత దగ్గర చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.