NLG: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్జీ కళాశాల మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు 5కే రన్ నిర్వహించారు. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ ఉన్నట్లు అని ఆమె సూచించారు.