NGKL: కల్వకుర్తి మునిసిపాలిటీ వడ్డెర బస్తీ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని స్థానిక కౌన్సిలర్ శ్రీరాములు అన్నారు. ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, పాఠశాల ఛైర్మన్ రమాదేవి, అంగన్వాడి టీచర్ జయమ్మ ఆయనను సన్మానించారు.