ADB: ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని DMHO నరేందర్ రాథోడ్ తో కలిసి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నాటు వైద్యాన్ని దూరంగా ఉండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.