MNCL: దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద విద్యుత్ షాక్తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక ఎస్సై తహసీద్దీన్ కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బంక్ వద్ద నుంచి స్టాండ్ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్కు తగలడంతో మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందారన్నారు.