KNR: శంకరపట్నం మండలంలో ఈనెల 10 నుంచి ఏప్రిల్ 7వ తేది వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు, మండల పశువైద్యాధికారి డాక్టర్ మాధవరావు తెలిపారు. మండలంలోని 27 గ్రామాలలో 8వ విడత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు డాక్టర్ మాధవరావు తెలిపారు. ఈ సదవకాశాన్ని మండల పరిధిలోని పాడి రైతులు, గొర్రెల యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.