KMR: పట్టణంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ (42) అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య రేణుక ఫిర్యాదు చేసినట్లు ఎస్సై చెప్పారు.