JGL: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాల నూతన భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు.