KMM: హైదరాబాద్లో ‘ప్రాపర్టీ పల్స్’ అనే దేశంలోనే మొట్టమొదటి రియల్ ఎస్టేట్ వారపత్రికను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాల వల్ల తెలంగాణలో రియల్ రంగం పుంజుకుంటోందని, ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా మారిందని తెలిపారు.