NDL: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. కల్లూరు మండలం నాయకల్లులో రైతులకు ఇవాళ నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.