KNRL: కోసిగి మండల MPP పెండేకంటి లవకుశ ఈరన్న భార్య, మాజీ వైస్ యంపీపీ పెండేకంటి నాగరత్నమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఇవాళ కోసిగి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరన్న కుటుంబాన్ని ఓదార్చి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.మురళీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.