MHBD: తొర్రూరులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని అన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు.