AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరో మహిళ మృతి చెందింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామలక్ష్మీ(73) అనే వృద్ధురాలు ఇవాళ మరణించింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. కల్తీ పాల ప్రభావంతో అస్వస్థతకు గురైన మరో 9 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.