కడప జిల్లాలో బస్సులో పోగొట్టుకున్న రూ.10 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలను గంగిరెడ్డిపల్లి ఎస్సై కృష్ణయ్య, సిబ్బంది వెతికి బాధితురాలు జ్యోతికి సురక్షితంగా అప్పగించారు. వీరపునాయనిపల్లి నుంచి వేంపల్లికి ప్రయాణించే సమయంలో పర్స్ మిస్ కావడంతో ఫిర్యాదు చేయగా బస్సును ఆపించి సీట్ల క్రింద వెతికగా పర్స్ లభించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.