HNK: జిల్లాలోని చారిత్రక రామప్ప ఉపాలయాలైన శివ తారకేశ్వర స్వామి ఆలయం, గొల్లాల ఆలయాలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా గుర్తించేందుకు భారత పురావస్తు శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాకతీయుల అద్భుత నిర్మాణ శైలికి ఈ రెండు ఆలయాలు ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఈ నిర్ణయంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ASIకు రాతపూర్వకంగా పంపాలన్నారు.