నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లోని వెస్ట్ బుకింగ్ కౌంటర్ వద్ద గుర్తు తెలియని (45) వ్యక్తి శనివారం రాత్రి మృతి చెందారు. అనారోగ్యంతో మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆ వ్యక్తిని గుర్తించలేకపోయారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం GGHకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.