కోనసీమ: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మల్కిపురం మండలంలోని విశ్వేశ్వరరాయపురం గ్రామంలో ఉన్న క్యాంపు కార్యాలయం వద్ద ఆయన ఆదివారం అధికారులు నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన డ్వాక్రా రుణాల చెక్కును అందజేశారు. అదేవిధంగా మహిళా నాయకులను ఎమ్మెల్యే సత్కరించారు