SRD: ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందడం లేదని చెప్పారు. అంతేకాకుండా గ్రామాల్లో మంచినీటి సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకోవాలన్నరు.