టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రేపు జరగబోయే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా, అతడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సూర్య వయసు 35 ఏళ్లు కావడంతో, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని అతడు భావిస్తున్నట్లు సమాచారం.