KNR: రేకుర్తి నేత్ర వైద్య శాలలో అత్యాధునిక ‘మాడ్యులర్ రెటీనా ఓటీ’ని మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ ప్రారంభించారు. ఈ అత్యాధునిక యంత్రాన్ని దేశంలోనే తొలిసారిగా ఇక్కడ కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. కేవలం రూ. 50 రిజిస్ట్రేషన్తో నాణ్యమైన సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి పారిశుద్ధ్యాన్ని మెచ్చుకున్నారు.