KMR: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో శనివారం భిక్కనూర్ లక్ష్మీ, చిట్యాల రాజమణిలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.