BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.