కోనసీమ: మందపల్లి శనేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పుష్కర నిధుల నుంచి భారీ మొత్తంలో నిధులు మంజూరయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న నూతన శాశ్వత అన్నదాన భవనానికి సుమారు రూ.1 కోటి 20 లక్షలు పుష్కర నిధుల నుంచి మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.