టాలీవుడ్లో ఒక క్రేజీ కాంబో సెట్ కానుంది. వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే అడివి శేష్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఓ కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథలోని సస్పెన్స్, కొత్తదనం శేష్ను బాగా ఆకట్టుకున్నాయట. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, డేట్స్ అడ్జస్ట్ అయ్యాక ఈ మూవీ పట్టాలెక్కననున్నట్లు సమాచారం.