E.G: తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల చేయాలని గోపాలపురం MLA వెంకటరాజును రైతులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే శనివారం తాడిపూడి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. దీంతో అధికారలు కాలువకు రెండు చోట్ల లీకేజీలు పూర్తి అయిన వెంటనే తాడిపూడి కెనాల్కు నీరు వదులుతామని వివరించారు. ఈ క్రమంలో సుమారు 7 ఎకరాలకు సాగునీరు అందుతుందని MLA వివరించారు.