PDPL: చిన్న పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లోనే తమ పిల్లలను చేర్పించాలని కీచులాటపల్లి సర్పంచ్ ఆనంద్ కోరారు. శనివారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ఆయన పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు.