ATP: బుక్కరాయసముద్రం మండలం పసలూరులో సాగుతున్న ఆర్డీఎస్ఎస్ పథకం పనులను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం పరిశీలించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో అధికారులకు సహకరించాలని గ్రామస్థులకు సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు అదనంగా 90 బృందాలను ఏర్పాటు చేయాలని ఏజెన్సీని ఆదేశించారు.