BDK: దుమ్ముగూడెం మండలం రేగుపల్లి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని హెడ్మాస్టర్ వేధింపులకు గురి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుందని PDSU భద్రాద్రి జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ అన్నారు. పిల్లల బాగోగులు చూడాల్సిన వారే ఇలా చేయడం దారుణమన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.