E.G: జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా, కమిషన్ కార్యదర్శి గుడే శ్రీనివాస్ జిల్లాలో పర్యటన సందర్భంగా శనివారం రాజమండ్రిలోని వోఎన్జీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ స్వాగతం పలికారు. ఛైర్మన్ వెంట జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ గడ్డం సునీల్ పాల్గొన్నారు.