MBNR: రాజాపూర్ మండలం చెన్నవల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పిట్టల శ్రీకాంత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. తన ఇంటి బాత్రూంపై తెగిపడిన విద్యుత్ వైరు సరిచేస్తుండగా బలమైన షాక్ తగిలింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే MBNR ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.