ATP: రైలు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కదిరిదేవరపల్లి – తిరుపతి ప్యాసింజర్ రైలు కళ్యాణదుర్గం స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. గురువారం కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలులో కొద్దిదూరం వెళ్ళాక సమస్య ఏర్పడటంతో, సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేసి కళ్యాణదుర్గం స్టేషన్కు చేర్చారు. దీంతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.