NTR: ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురంలో పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా ఉమ ఏర్పాటు చేసిన ఎద్దు గానుగ యూనిట్ను కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తే కుటుంబం, సమాజం బలోపేతం అవుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ నీతి ఆయోగ్ అధికారి ములేతో కలిసి ఆకాంక్షిత మండలాల్లో అభియాన్ 2.0 కార్యక్రమాన్ని పరిశీలించారు.