MDK: రామాయంపేటలో గాంధీ రోడ్డు దగ్గర ఉన్న పాలకేంద్రంలో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో మంటలను అదుపు చేశారు. పాలకేంద్రంలో ఫర్నిచర్, రెండు ఫ్రిజ్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.1,50,000 నష్టం జరిగినట్లు తెలిపారు.