VZM: ఈనెల 9న వంగర మండలం మగ్గూరు ఫిషరీస్ సొసైటీ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షులు పెనుబోతు దుర్గారావు శుక్రవారం తెలిపారు. ఈ ఆర్థిక ఏడాది మడ్డువలస రిజర్వాయర్ ఫిషరీస్ లీజుకు చెల్లించవలసిన సుమారు 18.30లక్షల నిధులు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సొసైటీ సభ్యులు హాజరవ్వాలని ఆయన కోరారు.