WGL: పర్వతగిరి మండల కేంద్రంలో మొక్కజొన్న పంటకు తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేయితికొచ్చే సమయంలోనే తెగుళ్లు ఏర్పడడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని వారు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పొలాలను పరిశీలించి తెగుళ్ల నివారణకు తగిన చర్యలు చేపట్టి, సరైన సూచనలు అందించాలని శుక్రవారం రైతులు విజ్ఞప్తి చేశారు.