MDK: రోడ్డు ప్రమాదంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్సై భౌతిక దాడికి పాల్పడ్డారని మెదక్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. కేసు పెట్టడానికి వెళ్లిన న్యాయవాదిపై దుర్భాషలాడి చెయ్యి చేసుకున్నారన్నారు. వెంటనే ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి బార్ అసోసియేషన్ సభ్యులు పిర్యాదు చేశారు.