KRNL: సి. బెళగల్ మండలం కొండాపురం గ్రామంలో గురువారం ఇరువర్గాల యువకుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. క్రికెట్ పోటీల విషయంలో రెండు రోజుల క్రితం వాగ్వాదం జరగడంతో, యువకులు బంధుమిత్రులతో కలిసి దాడులకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పెద్దలు, పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.